యాచారం సర్పంచ్ ఫోరం గౌరవ అధ్యక్షురాలిగా ముచ్చర్ల సుగుణ సంపత్

యాచారం సర్పంచ్ ఫోరం గౌరవ అధ్యక్షురాలిగా ముచ్చర్ల సుగుణ సంపత్ యాచారం: యాచారం మండల సర్పంచ్ ఫోరం మండల కార్యవర్గాన్ని బుధవారం మేడిపల్లిలో నిర్వహించిన సర్పంచ్‌ల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నకర్త మేడిపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల సుగుణ సంపత్‌ను యాచారం మండల సర్పంచ్ ఫోరం గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొర్ర అరవింద్ నాయక్ (మంతన్ గౌరెల్లి), ఉపాధ్యక్షులుగా నీలం శ్రీవిద్య (కురుమిద్ద), అంబోజి రమేష్ (తులేకుర్ద్), ప్రధాన కార్యదర్శిగా డేరంగుల శంకర్ (మల్కీజ్‌గూడ) ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా బోడ కృష్ణ (సింగారం), కిషన్ నాయక్ (నల్లవెల్లి), కోశాధికారిగా రమేష్ నాయక్ (కేసీ తండా), సహాయ కార్యదర్శిగా తొట్ట రమేష్ (చింతపట్ల) ఎన్నికయ్యారు. కార్యవర్గ...