🏠 manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 19 July 2026, 04:12 PM Posted by: admin

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

యాచారం: ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్‌రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారునికి అందజేశారు.

మొహమ్మద్ రజాక్ గారికి మంజూరైన రూ.28,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోటె శ్రీశైలం, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నీలం రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారునికి అందజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలమోని రామకృష్ణ యాదవ్, యాచారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జయప్రకాష్, మదర్ డైరీ డైరెక్టర్ మండలి జంగయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైకని వినోద్, వార్డు సభ్యులు దార దశరథ్, యూసఫ్ పటాన్, మాజీ సర్పంచ్ దూస రమేష్, సీనియర్ నాయకులు నీలం పాండు, బన్నే జంగయ్య, ఆడాల శ్రీకాంత్, మండల్ యాదగిరి, మూతకాని శ్రీకాంత్, కొప్పు శివ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home