🏠 manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 17 June 2026, 04:21 PM Posted by: admin

CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం

CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం

యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.
మన గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో మంజూరైన CMRF చెక్కులను యాచారం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోటె శ్రీశైలం గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.
లబ్ధిదారుల వివరాలు:
లిక్కి లక్ష్మమ్మ – రూ.36,000
మక్కపల్లి రవీందర్ – రూ.25,000
బేత బౌరమ్మ – రూ.18,000
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్య మరియు ఇతర అత్యవసర అవసరాల సమయంలో CMRF ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముచర్ల సుగుణ సంపత్, ఉప సర్పంచ్ దెంది మధుకర్ రెడ్డి, వార్డు సభ్యుడు ఆడాల శ్రీకాంత్, గ్రామ అధ్యక్షుడు కందుకూరి బాలరాజ్, యూత్ అధ్యక్షుడు ముంత గణేష్, సీనియర్ నాయకులు బేత జంగయ్య, బన్నే జంగయ్య, కలకొండ మల్లేష్, నల్లోల చంద్రయ్య, గోదాస్ రవి, నల్లోల గణేష్, జక్కర్త మధు, నల్లోల జగన్, బేత బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home